బీసీలంటే భాజపాకు చిన్నచూపు.. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

బడుగు బలహీనవర్గాలంటే భాజపాకు చిన్నచూపని, అందుకే బీసీ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated : 17 Apr 2024 06:23 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బడుగు బలహీనవర్గాలంటే భాజపాకు చిన్నచూపని, అందుకే బీసీ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడం భాజపా నేతలకు ఇష్టం లేదని, అందుకే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్‌రెడ్డికి అప్పగించారన్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ బండి సంజయ్‌ గెలవడం భాజపా అగ్ర నాయకులు ఇష్టం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని