ప్రచార వ్యూహాలపై ఎన్‌డీఏ అభ్యర్థులకు దిశానిర్దేశం

ప్రచార వ్యూహాలపై ఎన్‌డీఏ అభ్యర్థులకు దిశానిర్దేశం

Published : 17 Apr 2024 04:39 IST

జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు, పురందేశ్వరి, మనోహర్‌

ఈనాడు, అమరావతి: ఎన్‌డీఏ తరఫున లోక్‌సభ, శాసనసభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు, నామినేషన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి అభ్యర్థి మూడు పార్టీల కండువాలు ధరించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నా... ఓట్లు బదిలీ జరిగేలా చూడాలని స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య క్షేత్రస్థాయి వరకూ సమన్వయ సమావేశాలు జరగాలని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని