ప్రచార వ్యూహాలపై ఎన్డీఏ అభ్యర్థులకు దిశానిర్దేశం
ప్రచార వ్యూహాలపై ఎన్డీఏ అభ్యర్థులకు దిశానిర్దేశం
జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, పురందేశ్వరి, మనోహర్
ఈనాడు, అమరావతి: ఎన్డీఏ తరఫున లోక్సభ, శాసనసభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు, నామినేషన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి అభ్యర్థి మూడు పార్టీల కండువాలు ధరించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నా... ఓట్లు బదిలీ జరిగేలా చూడాలని స్పష్టంచేశారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య క్షేత్రస్థాయి వరకూ సమన్వయ సమావేశాలు జరగాలని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.