భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు.
మెదక్, మెదక్ అర్బన్, న్యూస్టుడే: గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. గురువారం రాత్రి మెదక్లో భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, కూడలి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘వికసిత భారత్, వికసిత తెలంగాణ’ భాజపాతోనే సాధ్యమని, భాజపాను అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిపించాలని కోరారు. దోపిడీ చేసేందుకే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ ఉద్యోగం నుంచి ఎమ్మెల్సీగా చేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొరపాటున గెలిచిందన్నారు. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, దీనికి రాహుల్గాంధీ కారణమని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర