అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు.

Published : 20 Apr 2024 04:29 IST

పాయకరావుపేట, నక్కపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు. ఇక్కడి వై జంక్షన్‌లో బస్సుపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నక్కపల్లి మండలంలోని గొడిచెర్లకు చేరుకున్నారు. రాత్రి అక్కడే ముఖ్యమంత్రి బస చేశారు. ఆయనతో పాటు అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎంపీ సత్యవతి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని