Goa election Result: గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ.. గవర్నర్ను కలవనున్న భాజపా
తీర రాష్ట్రం గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రెడీ అవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీకి కొద్ది దూరంలో
పనాజీ: తీర రాష్ట్రం గోవాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రెడీ అవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయిన కాషాయ పార్టీ.. స్వతంత్రులతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సాయంత్రం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరనున్నట్లు భాజపా వెల్లడించింది. ‘‘గోవాలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి తిరిగి అధికారంలోకి వస్తాం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భాజపా 8 స్థానాల్లో విజయం సాధించి.. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే 40 సీట్లున్న గోవాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు సాధించాలి. ప్రస్తుతం భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నప్పటికీ స్పష్టమైన మెజార్టీ ఇంకా దక్కలేదు. దీంతో స్వతంత్రుల మద్దతు కోరుతోంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీరి మద్దతుతో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
ఈ ఫలితాల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. ఈ పార్టీ ప్రస్తుతం 4 స్థానాల్లో గెలుపొందగా.. మరో 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ) కూడా భాజపాకు మద్దతిచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా.. తృణమూల్ కూటమి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!