Nara Lokesh: విశాఖలో లోకేశ్‌కు ఘన స్వాగతం.. ‘శంఖారావం’ సభకు భారీ ఏర్పాట్లు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది.

Updated : 10 Feb 2024 21:18 IST

విశాఖ: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘శంఖారావం’ కార్యక్రమం కోసం విశాఖ చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన అనంతరం రోడ్డు మార్గంలో ఇచ్ఛాపురం బయల్దేరారు. శంఖారావం సభలో పాల్గొనేందుకు ఇప్పటికే ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి  పార్టీ ముఖ్యనేతలు అక్కడికి చేరుకున్నారు.

నారా లోకేశ్‌ ఫిబ్రవరి  11 నుంచి ‘శంఖారావం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ‘యువగళం’ పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు మూడు చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లో లోకేశ్‌ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం స్వల్ప విరామంతో మిగిలిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని