Gujarat: గుజరాత్ ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా
గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. కొందరు విజయం సాధించగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) కాషాయ జెండా మళ్లీ రెపరెపలాడింది. గతంలో ఎన్నడూ లేనంతగా అఖండ మెజార్టీతో భాజపా ఘన విజయం సాధించింది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేశారు. కొందరు అంచనాలకు తగ్గట్లుగానే జయకేతనం ఎగురవేయగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల ఫలితాలు ఇలా ఉన్నాయి..
* గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా నేత భూపేంద్ర పటేల్ ఘట్లోడియా స్థానం నుంచి 2.13లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. పటేల్ ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 21వేల ఓట్లు మాత్రమే దక్కాయి.
* ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ కంభాలియా నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి ములు బేరాకు 77వేల ఓట్లు రాగా.. గఢ్వీకి 58వేల ఓట్లు పోలయ్యాయి.
* పాటీదార్ నేత, భాజపా అభ్యర్థి హార్దిక్ పటేల్ విరంగమ్ నుంచి విజయం సాధించారు. తన సమీప ఆమ్ ఆద్మీ అభ్యర్థి అమర్సిన్హ్ ఠాకోర్పై 51వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
* వాద్గామ్ నుంచి పోటీ చేసిన దళిత యువ నేత, కాంగ్రెస్ అభ్యర్థి జిగ్నేశ్ మేవానీ 4928 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ ఆయనకు మొత్తంగా 94,765 ఓట్లు రాగా.. భాజపా అభ్యర్థి మణిభాయ్ వాఘేలాకు 89,837 ఓట్లు వచ్చాయి.
* ఓబీసీ నేత, భాజపా అభ్యర్థి అల్పేశ్ ఠాకూర్ గాంధీనగర్ (సౌత్) నియోజకవర్గం నుంచి 36వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
* క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి, భాజపా అభ్యర్థి రీవాబా జడేజా జామ్నగర్(నార్త్) నుంచి విజయం సాధించారు. రీవాబాకు 84,336 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి బీపేంద్రసిన్హ్ జడేజాకు 22,822 ఓట్లు దక్కాయి.
* ఆప్ రాష్ట్ర చీఫ్ గోపాల్ ఇటాలియా కటార్గామ్ నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి వినోద్ మోరాదియా దాదాపు 65వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..