లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ రాజకీయం: హరీశ్రావు
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే వైదొలగి తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్లు చెప్పిన పనులన్నీ చేసి చూపిస్తానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వారెన్ని రాజకీయాలు చేసినా, దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణ వరపద్రాయిని అని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే.. మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపించాలని అసెంబ్లీలో తానే స్వయంగా కోరానని చెప్పారు. భారాసపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపొద్దన్నారు.
‘‘నిండిన కాల్వలు, పొంగిన వాగులు, పండిన పంటలకు నిదర్శనం కాళేశ్వరం. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే అని దుష్ప్రచారం చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయిన ఘటనలున్నాయి. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి తప్పితే.. ఇలాంటి వ్యాఖ్యలు తగదు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ‘మల్లన్న సాగర్’ చూపించాం కదా.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి
కాళేశ్వరం ఆయకట్టు 98 వేల ఎకరాలని అసత్యాలు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు రాని ప్రాంతాలకు ఇప్పుడు నీళ్లు వస్తున్న విషయం ప్రజలకి తెలుసు. ఎగువ మానేరు డ్యామ్ మండు వేసవిలో కూడా మత్తడి దూకుతోందంటే దానికి కారణం కాళేశ్వరమే. ఏ విచారణ అయినా చేయండి.. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. భూతద్దంలో చూపించి మాపై బురద చల్లేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది’’ అని హరీశ్రావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?