Bjp: భాజపాకు రూ.1000 విరాళంగా ఇచ్చిన ప్రధాని
భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను...
దిల్లీ: భాజపా మద్దతుదారులు పార్టీ బలోపేతం కోసం మైక్రో డొనేషన్స్ అందించి సహాయపడాలని ప్రధాని మోదీ కోరారు. పార్టీ కోసం తాను రూ.1000 విరాళంగా ఇచ్చినట్లు, పార్టీ మద్దతుదారులంతా విరాళాలు ఇవ్వాలని కోరుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేదే భాజపా విధానమని, దేశ సంస్కృతిని కాపాడుతూ నిస్వార్థంగా జీవితాంతం సేవ చేయడమే భాజపా క్యాడర్ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం మద్దతు దారులు ఇచ్చే మైక్రోడొనేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భాజపా బలోపేతమవుతుందని ట్వీట్ చేశారు. డోనేషన్ ఇచ్చిన రసీదును ప్రధాని ట్వీట్కు జతచేశారు. ఇందులో మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పాన్కార్డు నెంబర్ గోప్యత దృష్ట్యా చూపించలేదు. ఎందుకోసం డొనేషన్ ఇస్తున్నారు అన్న చోట పార్టీ ఫండ్ అని చూపించారు.విరాళం మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా కూడా రూ.1000 విరాళంగా ఇచ్చారు. నమో యాప్లో డొనేషన్ మాడ్యూల్ ద్వారా విరాళం ఇచ్చిన ఆయన భాజపాను బలోపేతం చేయడానికి తన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మద్దతుదారులతో పాటు, వారికి ప్రజా జీవితంలోని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను కూడా రెఫరల్ కోడ్ ఉపయోగించి విరాళాలు అందించడంలో భాగస్వాముల్ని చేయాలని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రారంభించిన మైక్రోడొనేషన్స్ స్వీకరణ దీనదయాళ్ జీ పుణ్యతిథి అయిన ఫిబ్రవరి 11, 2022వరకు కొనసాగుతుందని తెలిపారు.రూ.5నుంచి రూ.1000 వరకు విరాళాలుగా అందించవచ్చని నడ్డా ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు