Jagga Reddy: రేపు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చర్చించలేదని.. ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే తమతో చర్చించినట్లు ఆయన చెప్పారని ఆరోపించారు. గోడకు వేసి కొడతా అంటూ అవమానపరిచేలా రేవంత్ మాట్లాడుతున్నారని.. అలా రెచ్చగొట్టడం వల్లే తాను మీడియా ముందు మాట్లాడానన్నారు. రాజకీయ యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలన్నారు.
అసలేం జరిగిందంటే..
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్ను శనివారం పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసుస్టేషన్కు తరలించగా.. శనివారం ఆయనను కలవడానికి వచ్చిన సందర్భంగా రేవంత్ విలేకరులతో మాట్లాడారు. సిన్హాను వీహెచ్ కలిసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. ‘ఆ ఇంటిమీద వాలిన కాకి.. ఈ ఇంటిమీద వాలితే ఊరుకోం.. కాలుస్తాం.. సీఎం కేసీఆర్ను కలిసిన వ్యక్తి బ్రహ్మదేవుడైనా మేం కలిసేది లేదు.. అందుకే యశ్వంత్సిన్హాను మేం కలవలేదు’ అని స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దీన్ని పార్టీ నేతలెవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తీసి గోడకేసి కొడతాం’ అని వ్యాఖ్యానించారు.
రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పార్టీ రేవంత్ అయ్య జాగీరు కాదు, ఆయనెవరు సిన్హాను కలవొద్దనడానికి? దీనిపై అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తా’’ అని చెప్పారు. అసెంబ్లీ మీడియాహాలులో జగ్గారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘సీనియర్ నాయకుడైన హనుమంతరావును గోడకేసి కొడతానంటావా? ఆయన సిన్హాను కలవడంలో తప్పులేదు. సిన్హాను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్గాంధీ నామినేషన్ వేయించారు. మేం నీకు నౌకర్లమా? బంట్రోతులమా?’ అంటూ మండిపడ్డారు. రేవంత్ చిల్లర రాజకీయం చేస్తున్నాడు. సీఎల్పీకి చెప్పకుండానే జిల్లా నేతలకు కండువా కప్పుతున్నాడు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్గాంధీకి ఇచ్చిన మాట తప్పినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నా’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మళ్లీ జగ్గారెడ్డి స్పందిస్తూ రేపు ఓ సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?