BJP: భాజపాలో చేరిన పీసీ జార్జ్.. పార్టీ విలీనం
కేరళ జనపక్షం (సెక్యులర్) పార్టీ చీఫ్ పీసీ జార్జ్ భాజపాలో చేరారు. తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
దిల్లీ: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కేరళ(Kerala)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కేరళ జనపక్షం (సెక్యులర్) చీఫ్, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ తన పార్టీని భాజపాలో విలీనం చేశారు. తన కుమారుడు షాన్ జార్జ్, ఇతర నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం కమలదళంలో చేరారు. కేరళ భాజపా రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి ప్రకాశ్ జావడేకర్, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.
చేయని పనికి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు.. రాహుల్కు నీతీశ్ కౌంటర్
పీసీ జార్జ్ సారథ్యంలోని కేరళ జనపక్షం (సెక్యులర్) పార్టీ భాజపాలో విలీనమైందని భాజపా జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ వెల్లడించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతపై విశ్వాసంతోనే ఆయన తమ పార్టీతో కలిశారన్నారు. జనపక్షం విలీనం కేరళలో ఓ గొప్ప మార్పునకు నాంది కానుందని.. ఇక్కడ భాజపా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీ జార్జ్ గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో కేరళ కాంగ్రెస్లో పనిచేసిన జార్జ్.. 2019లో కేరళ జనపక్షం (సెక్యులర్) పార్టీని స్థాపించారు. అంతకుముందు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో చీఫ్ విప్గానూ పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!