BJP: భాజపాలో చేరిన పీసీ జార్జ్‌.. పార్టీ విలీనం

కేరళ జనపక్షం (సెక్యులర్‌) పార్టీ చీఫ్‌ పీసీ జార్జ్‌ భాజపాలో చేరారు. తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated : 31 Jan 2024 18:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు కేరళ(Kerala)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కేరళ జనపక్షం (సెక్యులర్‌) చీఫ్‌, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేశారు. తన కుమారుడు షాన్‌ జార్జ్‌, ఇతర నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం కమలదళంలో చేరారు. కేరళ భాజపా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్‌, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. 

చేయని పనికి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు.. రాహుల్‌కు నీతీశ్‌ కౌంటర్‌

పీసీ జార్జ్‌ సారథ్యంలోని కేరళ జనపక్షం (సెక్యులర్‌) పార్టీ భాజపాలో విలీనమైందని భాజపా జాతీయ కార్యదర్శి అనిల్‌ ఆంటోనీ వెల్లడించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతపై విశ్వాసంతోనే ఆయన తమ పార్టీతో కలిశారన్నారు. జనపక్షం విలీనం కేరళలో ఓ గొప్ప మార్పునకు నాంది కానుందని.. ఇక్కడ భాజపా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీ జార్జ్‌ గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో కేరళ కాంగ్రెస్‌లో పనిచేసిన జార్జ్‌.. 2019లో కేరళ జనపక్షం (సెక్యులర్‌) పార్టీని స్థాపించారు. అంతకుముందు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గానూ పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు