Telangana news: ఆ జీవో రద్దుచేయకపోతే దీక్షకు సిద్ధమవుతా: ఎంపీ కోమటిరెడ్డి
కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ
హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 246ను వ్యతిరేకిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్చేశారు. ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈనెల 18న జారీ చేసిన ఈ జీవో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి కేటాయిస్తూ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ-మహబూబ్నగర్ జిల్లాల మధ్య కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రోజుకు 8 నుంచి 11 టీఎంసీలు మేర కృష్ణా జలాలను తోడుకుపోతున్నా సీఎం కేసీఆర్పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీవో నెంబరు 246ని రద్దు చేయకపోతే తాను దీక్షకు సిద్ధమవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. అందుబాటులో ఉన్న 90 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలు ఎస్ఎల్బీసీకి, 40 టీఎంసీలు పాలమూరు -రంగారెడ్డి, 20 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నీటి కేటాయింపు విషయంలో అవసరమైతే సీఎం కేసీఆర్ను కలుస్తానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..