KTR: ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే హంగ్ వచ్చేది: కేటీఆర్
భారాస ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 చోట్ల ఓటమి పాలయ్యామని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజిగిరి లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లిందని, మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని చెప్పారు.
‘‘200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి.. నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. వారి మాటలనే నేను గుర్తు చేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విధ్వంసకర మనస్తత్వంగా కనిపిస్తుందట! సోనియా గాంధీకి ప్రజలు కరెంట్ బిల్లులు పంపేలా భారాస ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి. నిరుద్యోగ భృతిపై తప్పించుకున్నట్లే.. పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చింది. పార్టీ కమిటీలు పూర్తి చేయకపోవడం వల్ల నష్టం జరిగింది.. ఇక ముందు అలా జరగదు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్కు భయపడే పార్టీ భారాస కాదు. దిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే గులాబీ పార్టీ గెలవాలి’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం కేసు.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు