KTR: డబుల్ ఇంజిన్ సర్కార్.. ఒకటి మోదీ.. మరొకటి అదానీ: కేటీఆర్ ఎద్దేవా
ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) అన్నారు.
హైదరాబాద్: ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. భాజపా(BJP) రాజకీయ కక్ష సాధింపును ప్రజాకోర్టులో ఎదుర్కొంటామని భారాస(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. భాజపా నేతలపై నమోదు చేసిన కేసులను ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు చూపించగలవా? అని ఆయన సవాల్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ(PM Modi), భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారని.. ఈడీ విచారణను సమర్థంగా ఎదుర్కొంటారని చెప్పారు. మోదీకి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ బినామీ అని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.
‘‘ఈ 9 ఏళ్ల భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. భారాస నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. మా పార్టీకి చెందిన 12 మంది నాయకులపైకి సీబీఐ, ఈడీని పంపించారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. ప్రతిపక్షాలపై కేసులతో.. ప్రజలపై ధరలతో దాడి చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ, మోదీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసు. అదానీ ఎవరని చిన్న పిల్లాడిని అడిగినా మోదీ బినామీ అని చెబుతాడు. ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల డ్రగ్స్ దొరికినా అదానీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరగానే కేసులు ఏమైపోతున్నాయ్? సుజనా చౌదరిపై రూ.6వేల కోట్ల కేసు ఏమైంది? అదానీపై కేసులు ఏమయ్యాయి? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక ఇంజిన్ మోదీ.. మరో ఇంజిన్ అదానీ. ఆయనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పాలసీ చేసింది.. స్కామ్ అంటే అదీ. అదానీ పోర్ట్లో డ్రగ్స్ దొరికితే స్కామ్ కాదా? ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బీఎల్ సంతోష్ను విచారణకు పిలిస్తే దాక్కున్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. భాజపాలో ఉన్నవాళ్లంతా హరిశ్చంద్రుడి సోదర సోదరీమణులా? అదానీపై శ్రీలంక చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజల ముందుకొచ్చి చెప్పగలరా?’’ అని కేటీఆర్ నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య