ఆ రెండు కూటములూ అవినీతికి పర్యాయపదాలు: నడ్డా
సీపీఎం, కాంగ్రెస్.. రెండు పార్టీలూ కన్ఫ్యూజన్లో ఉన్నాయని, సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భాజపా జాతీయ....
కన్నూర్: సీపీఎం, కాంగ్రెస్.. రెండు పార్టీలూ అయోమయంలో ఉన్నాయని, సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించారు. కన్నూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములను అవినీతికి పర్యాయ పదాలుగా అభివర్ణించారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ప్రజలు స్వస్తి చెప్పాల్సిన సమయమిదేనన్నారు. శనివారం నడ్డా ధర్మదామ్లో ఎన్డీయే నుంచి పోటీ చేస్తున్న సీకే పద్మనాభన్ తరఫున చక్కరక్కల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూడీఎఫ్ హయాంలో సోలార్ కుంభకోణం, ఎల్డీఎఫ్ హయాంలో గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ రెండు కూటముల అవినీతిని ప్రజలు అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, సీపీఎం కేరళలో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ.. బెంగాల్లో మాత్రం భాజపాకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయంటూ మండిపడ్డారు. 2014లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేరళ అభివృద్ధి కోసం రూ.2లక్షల కోట్లు ఇచ్చామన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చినదానికంటే ఇది మూడు రెట్లు అధికమని చెప్పారు. శబరిమల అంశాన్ని ప్రస్తావించిన నడ్డా.. భాజపా స్థిరంగా పోరాడుతోందన్నారు. అయితే, సీపీఎం, సీఎం పినరయి విజయన్ తమ పోరాటాన్ని అణిచివేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మాత్రం కేవలం మాటలకే పరిమితమైపోయిందని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM