Mainpuri Bypoll: మామ స్థానం నుంచి కోడలు పోటీ.. డింపుల్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారు!
ములాయం సింగ్ యాదవ్ మృతితో ఖాళీగా మారిన మైన్పురీ లోక్సభా స్థానం నుంచి.. ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. పార్టీ గురువారం ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ(SP) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీగా మారిన మైన్పురీ(Mainpuri) లోక్సభా స్థానం నుంచి.. ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్(Dimple Yadav) బరిలోకి దిగనున్నారు. ఎస్పీ గురువారం ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ స్థానానికి డిసెంబరు 5న ఉప ఎన్నిక నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
వాస్తవానికి ఈ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ములాయం మనవడు, మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ను పోటీలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ, చివరకు డింపుల్ యాదవ్ను ఖరారు చేశారు. మామ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా పార్టీ ఆమెకు ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం. మైన్పురీ 1996 నుంచి సమాజ్వాదీకి కంచుకోటగా ఉంది. అఖిలేశ్ ఎమ్మెల్యేగా ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానం కూడా ఇదే లోక్సభ నియోజకవర్గంలో ఉంది. ఇదిలా ఉండగా.. 44 ఏళ్ల డింపుల్ యాదవ్ గతంలో 2012 ఉప ఎన్నికలో, 2014 సాధారణ ఎన్నికలో కన్నౌజ్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లోనూ అక్కడినుంచే పోటీ చేసి.. భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓటమిపాలయ్యారు.
ఐదు దశాబ్దాలపాటు ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్(82).. అక్టోబరు 10న కన్నుమూసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM