కోచ్బిహార్ ఘటన ‘మారణహోమమే’: దీదీ
పశ్చిమబెంగాల్లోని కోచ్బిహార్లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోచ్బిహార్లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలను కలిసేందుకు రాజకీయ నేతలు వెళ్లకుండా ఈసీ ఆదేశించడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు దీదీ ఆదివారం సిలిగురిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె దేశంలో అసమర్థ ప్రభుత్వం నెలకొందంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది కేంద్ర పరిశ్రమల పరిరక్షణ అంశానికి సంబంధించిన వారని.. అల్లర్లను అదుపుచేసే విషయంలో వారికి అనుభవం ఉండదని దీదీ పేర్కొన్నారు. ‘అల్లర్లు చోటుచేసుకున్నపుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందుగా లాఠీఛార్జి చేయడం, లేదా టియర్ గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించాలి. అదీ కుదరకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలకు పోవాలి. కానీ నిన్న కోచ్బెహర్లో సీఐఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో మరణించిన బాధితులకు మెడ, ఛాతి భాగాల్లో బుల్లెట్లు దిగాయి’ అని మమతా పేర్కొన్నారు.
‘భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నేను ఈరోజు అక్కడికి వెళ్లాలనుకున్నా. కానీ ఆ ప్రాంతంలోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) కాస్తా.. మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్గా మారింది’ అని మమతా విమర్శలు చేశారు.
బెంగాల్లో శనివారం నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోచ్బిహార్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీతల్కూచి 126 పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా దళాలు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారు. అల్లర్ల సమయంలో గ్రామస్థులు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే ఆత్మరక్షణలో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని ప్రత్యేక పోలీసు అధికారి వివేక్ దూబే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ