అవినీతి మరక ఉంటే ఆయన్ను డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారు?: కవితకు కొండా సురేఖ కౌంటర్‌

కాంగ్రెస్‌ పాలనపై భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్‌ ఇచ్చారు.

Updated : 08 Feb 2024 16:52 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనపై భారాస ఎమ్మెల్సీ కవిత చేసిన విమర్శలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కౌంటర్‌ ఇచ్చారు. ఆమె మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు.

‘‘భారాస పాలనలో తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు. వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన వాళ్లు ఇప్పుడు మాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డి నియామకం జరిగి రెండు వారాలే అయింది. 36 ఏళ్లుగా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన ఏమైనా లిక్కర్‌ స్కాం చేశారా? పేపర్లు లీక్‌ చేశారా? అవినీతి మరకే ఉంటే మీ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు కూర్చోబెట్టారు? సింగరేణి నిధులను సిరిసిల్ల, గజ్వేల్‌కు తరలించుకుపోయిందెవరు? నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మేం తీసుకుంటాం. మాట నిలబెట్టుకుంటామనే మాపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారు’’ అని కొండా సురేఖ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు