Malla reddy: చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు.. ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా?
తెలంగాణలో రామచంద్రుల చల్లని పాలన నడుస్తోందని కేటీఆర్, కేసీఆర్లను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం.
కేటీఆర్, కేసీఆర్లపై మల్లారెడ్డి పొగడ్తలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో రామచంద్రుల చల్లని పాలన నడుస్తోందని కేటీఆర్, కేసీఆర్లను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. ‘రామరాజ్యం గురించి విన్నాం, రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు’ అంటూ ప్రస్తుతించారు. సభలో పద్దులపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. ‘తెలంగాణలో యాదాద్రి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో ఏడు అద్భుతాల్ని చూస్తున్నాం. 28 రాష్ట్రాల్లో కేటీఆర్లాంటి ఐటీ మంత్రి ఎక్కడైనా ఉన్నారా..? మొన్న దావోస్ వెళ్లి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. కేటీఆర్ 110 ఏళ్లు దీర్ఘాయుష్షుతో జీవించాలి. కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి మాపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తోంది. మీ దోస్త్ అదానీకి అన్నీ అప్పగిస్తే పది దినాల్లోనే రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. టీఆర్ఎస్ అంటే చంద్రుడు.. బీఆర్ఎస్ అంటే సూర్యుడు. అప్పటి చల్లని చంద్రుడినే ఆపలేకపోయారు ఇప్పుడు మండే సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోగలరా? రామన్న సీఎం.. కేసీఆర్ పీఎం అవుతారు’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని