Malla Reddy: నా కుమారుడు భయంతో వణికిపోతున్నాడు: మంత్రి మల్లారెడ్డి
తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి నివాసం, సంస్థలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు కొనసాగుతుండగా.. ఇప్పటికే పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దాడులు చేయిస్తోందని ఆరోపించారు. హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధంగా కళాశాలలు నడుపుతున్నానని చెప్పారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రికి తమ సమీప బంధువు ప్రవీణ్రెడ్డిని తీసుకుని ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ‘‘మా కుటుంబంపై బీభత్సం చేస్తున్నారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నా కుమారుడు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు’’ అని మల్లారెడ్డి తెలిపారు. మరో వైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిచేసే మహిళకు ఫిట్స్ రావడంతో వెంటనే స్పందించిన ఐటీ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మల్లారెడ్డి ఇల్లు, సంస్థలు, బంధువులకు సంబంధించిన ఇళ్లపై మంగళవారం దాడులు చేపట్టిన ఐటీ శాఖ.. నేడూ వాటిని కొనసాగించింది. మరోవైపు మంత్రి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి గురువారం ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురై సూరారంలోని ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఇంటికి పలువురు నేతలు, కార్యకర్తలు తరలివచ్చి పరామర్శించారు. మంత్రికి చెందిన సంస్థలు, ఇళ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ కీసరలో తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
రేపు నగరానికి మల్లారెడ్డి అల్లుడు
మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు, తెరాస నేత మర్రి రాజశేఖర్రెడ్డి రేపు హైదరాబాద్ చేరుకోనున్నారు. గత నాలుగు రోజులుగా తుర్కియేలో ఉన్న ఆయన.. గురువారం నగరానికి రానున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్