షర్మిలా.. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలవాలి: మంత్రి పువ్వాడ అజయ్‌

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని..

Updated : 17 Jun 2022 14:56 IST

ఖమ్మం: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ఆమెను ప్రశ్నించారు. కళ్లలో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల.. ఇటీవల పువ్వాడ అజయ్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

‘‘ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు, దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే. మీ తండ్రి, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేటు. ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? పనిచేసిన వారినే సీఎం కేసీఆర్ గుర్తించి పదవులు ఇస్తారు.. అందుకు నేను గర్విస్తున్నా. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించు. పాలేరులోనూ నా దమ్ము చూపిస్తా ’’ అని పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని