విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు: విజయసాయి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు సేకరించామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
దిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 125 మంది ఎంపీల సంతకాలు సేకరించామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా త్వరలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిందన్నారు. పరిశ్రమకు నష్టాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించినట్లేనన్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో మాట్లాడినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
‘‘రూ.4,200 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇస్తాం. రాష్ట్రం వాటా రుణం రూపంలో ఇచ్చేందుకు అనుమతి కోరాం. త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటవుతుందని చెప్పారు. దక్షిణమధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరాం. అండర్ పాస్ బ్రిడ్జిలు, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నాం. ఏపీకి 2 వందే భారత్ రైళ్లు ఇవ్వాలని మంత్రిని కోరాం. విశాఖ-హైదరాబాద్, విశాఖ-చెన్నై మధ్య రైళ్లు నడపాలని కోరాం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ముదిగుబ్బ-ముద్దునూరు మధ్య 65 కి.మీ రైల్వేలైను వేయాలని కేంద్ర రైల్వేమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్టు కడప ఎంపీ అవినాష్రెడ్డి తెలిపారు. బనగానపల్లె-కర్నూలు మధ్య 70కి.మీ మేర రైల్వే లైనుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. కొత్త లైను ఏర్పాటుకు ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించారని, కొత్త రైల్వే లైనును త్వరగా మంజూరు చేయాలని కోరామన్నారు. ప్రతిపాదిత మార్గాల్లో అనేక సిమెంట్, ఇతర పరిశ్రమలు ఉన్నాయని అవినాష్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM