Nara Lokesh: జగన్ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్
గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు.
అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ‘‘ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం రాజ్యమేలుతోంది. కొంతమంది పోలీసులు దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్లుగా మారుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం జగన్ ఖాకీలను ప్రైవేటు ఫ్యాక్షన్ సైన్యంగా వాడటంతో వారికీ నేరాలు అలవాటైపోయాయి’’ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
పాలకులే సీఐడీని కిడ్నాపులు, బెదిరింపులకు వినియోగిస్తున్నారు. తాము ఏం చేసినా అడిగేవారు లేరని పోలీసులు ముఠాలుగా ఏర్పడటం ఆ వ్యవస్థ గౌరవాన్ని మంటగలిపింది. కర్నూలు డీఐజీ ఆఫీస్లో ఎస్సైగా పనిచేస్తున్న సుజన్ ఓ ముఠాని ఏర్పాటు చేసి.. ఏపీ సీఐడీ బృందం పేరుతో ఐటీ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసి హైదరాబాద్లో చిక్కిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 22 కిలోల గంజాయితో కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులకు చిక్కడం ఏపీలో పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారిన దుస్థితిని వెల్లడిస్తోంది’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు