Rahul Gandhi: ఇలాంటివి సాధ్యమని నేను ఊహించలేదు: రాహుల్ గాంధీ
లోకసభ సభ్యత్వ రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్ (Congress ) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో భారత సంతతి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానిపై బుధవారం రాహుల్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్(Stanford University )లో మాట్లాడుతూ ‘‘నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో.. వేటిని ఎదుర్కోవాల్సి వస్తుందో అస్సలు ఊహించలేదు. అసలు ఇలా జరుగుతుందని (లోక్సభ సభ్యత్వం రద్దు) అసలు అనుకోలేదు. కానీ, ఆ తర్వాత దీనిని నాకు లభించిన పెద్ద అవకాశంగా భావించా. నాకు లభించిన వాటిల్లో ఇదే పెద్ద అవకాశం. రాజకీయాలంటే అలానే ఉంటాయి’’ అని అన్నారు.
ఇక భారత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ ఆరు నెలల క్రితం మొదలైంది. అప్పట్లో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి. అధికార పక్ష ఆర్థిక ఆధిపత్యం, సంస్థాగత పెత్తనం నడుస్తున్నాయి. మా దేశంలోనే మేం ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం. ఆ సమయంలో భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారత్ నుంచి వచ్చిన విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వారితో తాను ముచ్చటించడానికి ఇది మంచి సమయమని అభిప్రాయపడ్డారు. భారత్- చైనా సంబంధాలు అంత సులువుకాదని.. కఠినంగా ఉండబోతున్నాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. భారత్ను వెనక్కి నెట్టడం చైనాకు సాధ్యం కాదని చెప్పారు.
దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని భారత్లో కొంతమంది భావిస్తుంటారని, అలాంటి ఓ ప్రత్యేక మనిషిగా ప్రధాని మోదీ నిలుస్తారని రాహుల్గాంధీ బుధవారం ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా నిన్న కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ’ నిర్వహించిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
నా ఫోన్ ట్యాప్ చేశారని తెలుసు..
రాహుల్ నిన్న శాన్ఫ్రాన్సిస్కోలో సిలికాన్ వ్యాలీలోని స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లతో టెక్నాలజీ, డ్రోన్లు వంటి అంశాలపై మాట్లాడూతూ... భారత్లో మీరు ఎటువంటి టెక్నాలజీ అయినా వ్యాప్తి చేయాలనుకుంటే.. అధికార వికేంద్రీకరణ కలిగి ఉండాలన్నారు. డ్రోన్ వంటి టెక్నాలజీలు అధికారిక నిబంధనల అడ్డంకిని ఎదుర్కొంటాయని తెలిపారు. డేటా సురక్షితకు సరైన నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పెగసస్ వంటి టెక్నాలజీలకు తాను భయపడనని రాహుల్ తెలిపారు. తన ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం తెలుసన్నారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా తన ఫోన్ తీసుకొని ‘హలో మోదీ’ అని అన్నారు. డేటా ప్రైవసీకి బలమైన నిబంధనలు ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ఒక వేళ ప్రభుత్వం మీ ఫోన్ ట్యాప్ చేయాలని నిర్ణయిస్తే ఎవరూ ఆపలేరు’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
-
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
-
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
-
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
-
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ