Sandeshkhali Case: తెల్లపేపర్పై సంతకం చేయించి.. రేప్ కేసు పెట్టారు: సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు
Sandeshkhali Case: సందేశ్ఖాలీలో మహిళలపై అకృత్యాలకు సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీఎంసీ నేతలపై పెట్టిన కేసును ఓ మహిళ ఉపసంహరించుకున్నారు. తనతో బలవంతంగా తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆరోపించారు.
కోల్కతా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో సందేశ్ఖాలీ ఆందోళనల వ్యవహారం (Sandeshkhali Case) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా భాజపా కుట్రేనని ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ (TMC) సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ టీఎంసీ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, స్థానిక భాజపా కార్యకర్తలు తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. (Women Protest In Sandeshkhali)
‘‘భాజపా (BJP) మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఆ మధ్య మా ఇంటికి వచ్చారు. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై నా సంతకం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారు. నేనెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదు. నాపై ఎలాంటి అకృత్యాలు జరగలేదు’’ అని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నానని చెప్పారు. ఈ విషయం తెలిసి కొందరు భాజపా నేతలు తనను బెదిరిస్తున్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఆరోపణలను భాజపా నాయకులు ఖండిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సందేశ్ఖాలీ ఘటన భాజపా కుట్ర అని ఆరోపించిన టీఎంసీ.. ఇటీవల స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఉన్నట్లు భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపించింది. షాజహాన్ షేక్ సహా ముగ్గురు తృణమూల్ నేతలపై అత్యాచార ఆరోపణలు చేసేలా స్థానిక మహిళలను ప్రేరేపించాలని సువేందు తనకు సూచించినట్లు అతడు ఆ వీడియోలో చెప్పారు.
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!
ఈసీని ఆశ్రయించనున్న టీఎంసీ..
ఈ నేపథ్యంలో సందేశ్ఖాలీ వ్యవహారంపై టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది. వీడియో ఆధారంగా భాజపా నేత సువేందు, ఇతరులపై ఫిర్యాదు చేస్తామని టీఎంసీ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ మేరకు ఈసీకి లేఖ రాస్తామని తెలిపాయి. అయితే, ఈ వీడియోను భాజపా నేతలు ఖండిస్తున్నారు. అది మార్ఫింగ్ వీడియో అని, కృత్రిమ మేధ (ఏఐ)తో తన స్వరాన్ని రూపొందించి, అందులో పెట్టారని భాజపా మండల శాఖ అధ్యక్షుడు గంగాధర్ ఆరోపించారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Express: ఇంజిన్లో మంటలు చెలరేగటంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండయ్యింది. -
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను చేయను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం