Sharad Pawar: ‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
శరద్ పవార్ (Sharad Pawar) కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడిని కానందువల్లే తనకు రాజకీయ అవకాశాలు రాలేదన్నారు. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం (పార్టీ పగ్గాలు చేపట్టే) ఇవ్వాలన్నారు. భాజపాతో కలిసి పనిచేసే విషయంపై గతంలో సంప్రదింపులు జరిపినట్లు శరద్ పవార్ అంగీకరించడం గొప్ప విషయమన్నారు. పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బాబాయ్పై అజిత్ పవార్ ఈ విమర్శలు గుప్పించారు.
‘నా వయసు 60 ఏళ్లుపైనే. మనకు అవకాశం రావాలా? వద్దా? మనం ఏమైనా తప్పు చేస్తున్నామా? అందుకే ఈ భావోద్వేగం. పవార్ సాహెబ్ కూడా మనకు దైవంతో సమానం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, ప్రతి వ్యక్తికీ ఓ సమయం ఉంటుంది. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించాలి. పవార్ కుమారుడినైతే నాకు అవకాశం వచ్చేదా? అలా అయితే వచ్చి ఉండేది. ఆయన కుమారుడిని కానందువల్లే ఆ (పార్టీ పగ్గాలు చేపట్టే) అవకాశం రాలేదు. ఇదెక్కడి న్యాయం?’ అని అజిత్ పవార్ ప్రశ్నించారు. శిరూర్ లోక్సభ పరిధిలో ప్రచారం నిర్వహించిన అజిత్.. శరద్ పవార్ తీరుపై విమర్శలు చేశారు.
యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్డ్యాన్స్..!
భాజపాతో కలిసి పనిచేయాలని శరద్ పవార్ గతంలో ప్రయత్నించడంపైనా అజిత్ స్పందించారు. తనతోపాటు ప్రఫుల్ పటేల్ సమక్షంలోనే భాజపా అధిష్ఠానంతో ఆరుసార్లు భేటీలు జరిగాయన్నారు. దిల్లీ నుంచి ముంబయికి తిరిగి వచ్చిన తర్వాతే పవార్ నిర్ణయం మార్చుకున్నారని, అనంతరం శివసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయించారని అన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేకుంటే చర్చలు ఎందుకు జరిపారని ప్రశ్నించారు.
మరోవైపు పుణె జిల్లాలోని బారామతి లోక్సభ స్థానం పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. మే 7న ఇక్కడ పోలింగ్ జరిగింది. అజిత్ భార్య ఇక్కడినుంచి పోటీ చేయగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. ఇదిలాఉంటే, అజిత్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీని వీడి ఏక్నాథ్ శిందే వర్గంలో చేరిన విషయం తెలిసిందే. భాజపా ప్రభుత్వం ఏర్పాటుచేయగా.. అజిత్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదో విడతలో జోరెవరిదో!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. -
మాలీవాల్ ఎడమకాలు, కుడిచెంపపై గాయాలు
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో వైద్య నివేదిక కీలకంగా మారింది. దిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. -
సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంటు భద్రత
పార్లమెంటు భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. -
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
మహారాష్ట్రలోని ఠాణెలో ఓ న్యాయవాదికి మామిడి పండ్ల దొంగతనానికి సంబంధించిన కేసులో వందేళ్ల కిందట ఠాణె న్యాయస్థానం వెలువరించిన తీర్పు కాపీ దొరికింది. -
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజిన్లో మంటలు రేగాయి. -
అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్ ఖలీ’ ముచ్చట్లు
‘ది గ్రేట్ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్ దలీప్ సింగ్ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. -
పుదుచ్చేరి బీచ్లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన
చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్లో స్నానాలు నిషేధించింది. -
అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు
రాజస్థాన్లోని భరత్పుర్ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్ (62) వాపోయారు. -
డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగిలి రైలు ప్రయాణికులకు గాయాలు
ఛత్తీస్గఢ్ రాజధాని నగరం రాయ్పుర్ శివారులో ఆదివారం ఉదయం కదులుతున్న రైలుకు భారీ డ్రిల్లింగ్ యంత్రం రాడ్డు తగలడంతో ఇద్దరు ప్రయాణికులతోపాటు పారిశుధ్య సిబ్బంది ఒకరు గాయపడినట్లు రైల్వే పీఆర్వో తెలిపారు. -
విశ్వ మానవులం!
ప్రపంచంలో ఏ మూలన ఉన్నాసరే, ఇతరులపైన బాగా ఆధారపడాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. గతంలో స్థానిక వ్యక్తులు, సమస్యల గురించే ఆలోచించాల్సి వచ్చేది. కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు మనందరి మీదా ప్రభావం చూపుతాయి. -
రాజకీయాలకు మేం అతీతం
సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. -
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
మధ్యప్రదేశ్లో ఓ పులి మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు