Mumbai Indians: ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
ముంబయి ఇండియన్స్లో హార్దిక్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఆటగాళ్లు తమ అభిప్రాయాలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చారు.
ఇంటర్నెట్డెస్క్: ముంబయి ఇండియన్స్ (Mumbai Indian) జట్టులో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులు.. వరుస ఓటములతో బహిర్గతమవుతున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ ఆటగాళ్లు.. డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి, హార్దిక్ నాయకత్వంతో వస్తోన్న ఇబ్బందులను కోచింగ్ సిబ్బందికి వెల్లడించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి.. అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది. మరో వైపు రోహిత్ నాయకత్వంలో దాదాపు పదేళ్లు ఆడిన జట్టు.. హార్దిక్ శైలికి ఇంకా అలవాటు పడలేదనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్లో సందడి కరవు కావడానికి కొత్త కెప్టెన్ శైలే కారణమని సీనియర్లు.. కోచ్ బృందానికి వెల్లడించారు.
ఇటీవల ఓ మ్యాచ్ సందర్భంగా ముంబయి ఆటగాళ్లు, జట్టు కోచింగ్ సిబ్బంది సమావేశమయ్యారు. దీనిలో రోహిత్, సూర్య, బుమ్రా తదితర సీనియర్లు కూడా పాల్గొన్నారు. జట్టు సరిగ్గా ఆడలేకపోవడంపై భోజనాల సమయంలో తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. ఆ తర్వాత సీనియర్లు, జట్టు మేనేజ్మెంట్ బృందంతో ఒక్కొక్కరుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై ముంబయి జట్టు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘రోహిత్ నాయకత్వంలో పదేళ్లు ఆడిన జట్టు కొత్త మార్పునకు అలవాటు పడలేదు. సాధారణంగా ఎక్కడైనా నాయకత్వ మార్పు చోటు చేసుకుంటే తలెత్తే బాలారిష్టాలాంటివే ఇవి కూడా’’ అని వ్యాఖ్యానించారు.
తిలక్ వర్మపై నిందలతో వివాదం..
ఇటీవల దిల్లీతో జరిగిన మ్యాచ్లో ఓటమికి టాప్ స్కోరర్ తిలక్ వర్మను హార్దిక్ తప్పుపట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అతడికి మ్యాచ్ పరిస్థితిపై అవగాహన లేకపోవడమే ఓటమికి కారణమని వ్యాఖ్యానించాడు. ‘‘అక్షర్ పటేల్ (డీసీ బౌలర్) ఓ లెఫ్ట్ హ్యాండర్కు (తిలక్) బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో సదరు బ్యాటర్ అతడిపై దూకుడుగా ఆడి ఉండాల్సింది. ఆటపై ఉండే ఈ చిన్న అవగాహన లోపించడంతో మ్యాచ్లో మూల్యం చెల్లించుకున్నాం’’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో తిలక్ 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు.
ఏకపక్షంగా ఓటమి మొత్తాన్ని తనపై నెట్టేయడంతో తిలక్ వర్మ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్లో అతడు హార్దిక్ వద్ద ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరిగింది.
జట్టులో వర్గాలున్నట్లు కనిపిస్తోంది: క్లార్క్
ముంబయి జట్టుపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ క్లార్క్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. వారి ఆటతీరు చూస్తుంటే వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోందన్నారు. ‘‘ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో చాలా గ్రూపులు ఉన్నట్లు భావిస్తున్నా. వారు సమష్టిగా లేరు.. ఓ జట్టులాగా ఆడటంలేదు’’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం