Virat - Yuvraj: ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ పంజాబ్తో బెంగళూరు తలపడనుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి మరోసారి మంచి ఇన్నింగ్స్ రావాలని అతడి అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమం ఎవరంటే? ఠక్కున విరాట్, రోహిత్, స్టీవ్ స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్ పేర్లు చెబుతారు. వీరిలో ఒక్కరినే ఎంచుకోవాలంటే మాత్రం కాస్త తటపటాయిస్తారు. అయితే, ఈ తరం బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీనేనని (Virat Kohli) భారత మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. వచ్చే వరల్డ్ కప్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు. జూన్ నుంచి ప్రారంభం కానున్న పొట్టి కప్ కోహ్లీకి ఆరోది. తొలిసారి 2012 ఎడిషన్లో ఆడాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే కావడం గమనార్హం.
‘‘ఈ తరంలో అన్ని రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడు. ఎవరు కాదన్నా సరే.. ప్రస్తుత తరానికి అన్ని ఫార్మాట్లలో అతడే బెస్ట్ బ్యాటర్. విరాట్ కూడా టీ20 వరల్డ్ కప్ను సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఆటను అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. క్రీజ్లో చివరివరకూ అతడు ఉన్నాడంటే.. మ్యాచ్ను ముగించగల సత్తా ఉంది. చాలా సందర్భాల్లో విరాట్ ఒంటరిగానే భారత్ను గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఒక్కసారి కుదురుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా టీమ్ఇండియా ఛేదించినట్లే. ఏ బౌలర్పై ఎటాకింగ్ గేమ్ ఆడాలి.. కేవలం సింగిల్స్తోనే సరిపెట్టుకున్నాడంటే ప్రత్యర్థి బౌలింగ్ను గౌరవించి.. ఏమాత్రం అవకాశం వచ్చినా దూకుడు మొదలెట్టేస్తాడు. ఇప్పుడు కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటికే 500+ స్కోరు చేశాడు. నెట్స్లోనూ చాలా తీవ్రంగా శ్రమించడం వల్లే అందరికీ భిన్నంగా రాణించగలుగుతున్నాడు’’ అని యువీ తెలిపాడు.
ఫామ్పై రోహిత్కు ఆందోళన: షాన్ పొలాక్
‘‘ప్రస్తుత సీజన్లో ముంబయి తరఫున రోహిత్ శర్మ పెద్దగా పరుగులు చేయలేదు. అతడి ఫామ్ కూడా ఆందోళనకరంగా ఉంది. మంచి ఆరంభం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముంబయి మరో రెండు మ్యాచ్లను మాత్రమే ఆడాల్సి ఉంది. కనీసం ఇందులోనైనా మంచి ప్రదర్శన ఇస్తే.. ప్రపంచ కప్ నాటికి సగర్వంగా వెస్టిండీస్లో అడుగుపెట్టొచ్చు. గ్రౌండ్ షాట్లను అద్భుతంగా ఆడుతున్న అతడు విభిన్నంగా కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరుతున్నాడు. స్కూప్ షాట్లకు వెళ్లి వికెట్ను సమర్పిస్తున్నాడు. దానిని మార్చుకుంటే రోహిత్కు తిరుగుండదు’’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్ను దాటి ప్లేఆఫ్స్ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి. -
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి