TDP: దుగ్గిరాలలో ‘నిజం గెలవాలి’ యాత్ర.. భువనేశ్వరికి ఘనస్వాగతం

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నారా భువనేశ్వరి పర్యటించారు.

Published : 06 Feb 2024 16:20 IST

దుగ్గిరాల: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఆ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. దుగ్గిరాలకు వచ్చిన భువనేశ్వరికి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. కన్నెగంటి మోహన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం శౌరి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు