Karnataka: 10మంది భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్.., స్పీకర్పై అవిశ్వాసానికి ప్రతిపక్షాల నోటీసు
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన 10 మంది భాజపా ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు (Karnataka Assembly) నేడు రసాభాసగా కొనసాగాయి. ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోడియంను చుట్టుముట్టిన భాజపా సభ్యులు.. కాగితాలను చింపి స్పీకర్ ఛైర్పైకి విసిరేశారు. వీరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ (Speaker).. మంత్రి సిఫార్సు మేరకు 10మంది భాజపా సభ్యులను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం.. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయనపై భాజపాతోపాటు జేడీఎస్లు సంయుక్తంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.
ఎంపీల ‘అక్రమ సంబంధం’తో రాజీనామాలు.. సింగపూర్ పార్లమెంటులో కుదుపు
నేడు సమావేశాలు మొదలైన వెంటనే.. ఐఏఎస్ల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. ఇదే సమయంలో మధ్యాహ్న భోజన సమయం లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతాయని స్పీకర్ నిర్ణయించారు. దీంతో ఆగ్రహించిన భాజపా సభ్యులు.. స్పీకర్ ఛైర్ వద్దకు వెళ్లి కాగితాలను చింపి విసిరేశారు. ఆ సమయంలో స్పీకర్ ఛైర్లో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానీ ఉన్నారు. దీంతో 10మంది భాజపా సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి హెచ్కే పాటిల్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి స్పీకర్ ఆమోదం తెలిపారు. అనంతరం సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ విధానసౌధ బయట మాజీ సీఎం బొమ్మైతో సహా పలువురు నిరసన చేపట్టగా.. వారందర్నీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ యూటీ ఖాదెర్పై అవిశ్వాస తీర్మానానికి భాజపా, జేడీఎస్ పార్టీలు సంయుక్తంగా నోటీసులు ఇచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జులై 3న ప్రారంభం కాగా.. జులై 21 వరకు కొనసాగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు