PM Modi: మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన అభిమానులు

భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు.

Updated : 15 Mar 2024 20:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు పలువురు భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర సుమారు గంట సేపు ఈ యాత్ర కొనసాగింది. రోడ్‌షో అనంతరం ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని