Australia: ‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా (Australia)లో ఓ మహిళా ఎంపీకి తన సొంత నియోజకవర్గంలోనే దారుణ ఘటన ఎదురైంది. రాత్రి వేళ బయటకు వెళ్లిన ఆమెకు కొందరు దుండగులు మత్తుమందు ఇవ్వడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.
క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటనీ లాగా (37).. ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇటీవల ఒక రోజు సాయంత్రం వేళ ఆమె బయటకు వెళ్లారు. ‘‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థాలు ఇచ్చి నాపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. అనంతరం వైద్యులు నాకు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. కానీ.. వాటిని నేను తీసుకోలేదు’’ అని వెల్లడించారు. ఈ ఘటన ఏప్రిల్ 28న చోటు చేసుకున్నట్లు వివరించారు.
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
తన మాదిరిగా చాలా మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొన్నారని.. బాధితులు తనను కలిసి విషయాన్ని వెల్లడించారని బ్రిటనీ పేర్కొన్నారు. ఆ డ్రగ్స్ తన శరీరంపై ప్రభావం చూపాయని.. వారు కూడా మత్తు మందుకు ప్రభావితమై ఉండొచ్చని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఈ దారుణాలను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిటనీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎంపీపై జరిగిన అఘాయిత్యంపై క్వీన్స్లాండ్ హౌసింగ్ మంత్రి మేఘన్ స్కాన్లాన్ స్పందించారు. ఒక నాయకురాలికి ఇలా జరగడం షాక్కు గురి చేసిందన్నారు. లైంగిక దాడుల నుంచి మహిళలను రక్షించడంతో పాటు గృహహింసను నిరోధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.