Andhra news: నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి

ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

Updated : 05 May 2024 18:41 IST

కడప: ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుందన్న కోపంతో ఎనిమిది నెలల గర్భిణిపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంబళ్లపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో వేపుడుకోట పంచాయతీ కోటకోళ్లపల్లెకు చెందిన మల్లికార్జున, ఆయన భార్య కల్యాణి గ్రామ సమస్యలపై ఆమెతో మాట్లాడారు. గ్రామానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు కల్యాణి గర్భిణి అని కూడా చూడకుండా కాళ్లతో తన్ని విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన భర్త మల్లికార్జునను సైతం చితకబాదారు. గాయపడిన దంపతులను 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని