Punjab Polls: సీఎం చన్నీకి భగవంత్ మాన్ సవాల్!
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు ......
చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్నీపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలు విపక్షాలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సీఎం చన్నీకి సవాల్ విసిరారు. తాను బరిలో ఉన్న ధూరి స్థానంలో చన్నీ పోటీ చేయగలరా? అన్నారు. చన్నీ పోటీ చేస్తున్న చామ్కౌర్ షాహిబ్ సీటు రిజర్వుడ్ స్థానం గనక తాను అక్కడి నుంచి పోటీ చేయలేననీ.. కానీ చన్నీ ధూరి సీటులో పోటీ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఆయన తనపై పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని భగవంత్ మాన్ చెప్పారు. మరోవైపు, శనివారం భగవంత్ మాన్ చన్నీ అమృత్సర్లోని స్వర్ణదేవాలయం, శ్రీరామతీర్థ మందిర్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం చన్నీ తన పేరిట ఉన్నట్టుగా రూ.56కోట్ల విలువైన అక్రమాస్తులకు సంబంధించిన పేపర్లపై ఆయన తప్పనిసరిగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలోని ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంలో చన్నీ జోక్యం ఉన్నట్టు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ కూడా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా భగవంత్ మాన్ ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM