Raghurama: ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా?: ఎంపీ రఘురామ ఎద్దేవా
ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు (Raghurama) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) కుటుంబం ఐదేళ్లు రోడ్లపైనే ర్యాలీలు, సభలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘మీతో పాటు కుటుంబంమంతా ఐదేళ్లు రోడ్లపైనే సభలు, ర్యాలీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా? మీరు తిరిగిన ఐదేళ్లలో గత ప్రభుత్వం నిషేధం విధించలేదే? చిన్న ఘటన కూడా జరగకుండా చూసిందే తప్ప.. అనుమతులు రద్దు చేయలేదే? రాజకీయ పార్టీల సభలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా?’’ అని రఘురామ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.