Rajnath Singh: అప్పట్లో గాంధీజీ, సర్దార్ పటేల్.. ఇప్పుడు ప్రధాని మోదీ: రాజ్నాథ్
గుజరాత్ రాష్ట్రానికి 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్లు గౌరవ చిహ్నాలుగా నిలిస్తే, 21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గౌరవ చిహ్నాంగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి రాజ్నాథ్ అన్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రానికి 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్లు గౌరవ చిహ్నాలుగా నిలిస్తే, 21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గౌరవ చిహ్నాంగా నిలుస్తున్నారని కేంద్రమంత్రి రాజ్నాథ్ అన్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని రావణుడితో పోల్చడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. అసభ్య పదాలు ఉపయోగిస్తున్న ఆ పార్టీకి గుజరాత్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు.
‘‘మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహా నేతలు 20వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రానికి గౌరవ చిహ్నాలుగా నిలిచారు. 21వ శతాబ్దంలో ప్రధాని మోదీ గుజరాత్ గౌరవ చిహ్నాంగా ఆవిర్భవించారు. కానీ, విపక్ష పార్టీ ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేస్తూ, అసభ్య పదాలను ఉపయోగిస్తోంది. ప్రధాని పదవి అంటే కేవలం వ్యక్తి కాదు.. అదో వ్యవస్థ. గుజరాత్ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన రీతిలో సమాధానం చెబుతారు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోసం పోరాడుతుంటే, ఆప్ తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. మొత్తం 182 స్థానాల్లో మూడొంతుల స్థానాలు గెలిచి భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 1,5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ