shemushi bajpayee: అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్‌ని నియమించిన ఈసీ

అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

Published : 08 May 2024 17:31 IST

అమరావతి: అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్‌ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిపై సోమవారం ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా షిముషి బాజ్‌పేయ్‌ని ఈసీ నియమించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు