జీఎస్టీ బకాయిలపై వాయిదా తీర్మానం: నామా
జీఎస్టీ బకాయిలపై ప్రాంతీయ పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు.
పార్లమెంట్ ఆవరణలో 10 ప్రాంతీయ పార్టీలు నిరసన
దిల్లీ: జీఎస్టీ బకాయిలపై ప్రాంతీయ పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెరాసతో పాటు మరో 9 పార్టీల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెరాస ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గాంధీ విగ్రహం సాక్షిగా ధర్నా చేశామన్నారు. కేంద్రం నుంచి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే సుమారు రూ.9వేల కోట్ల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయని చెప్పారు. ఈ సమయంలో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి.. రావాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడతామని చెప్పారు. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చామని.. చర్చ కోసం పట్టుబడతామని నామా స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కోరామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి