‘ఆత్మపరిశీలన’లో మహారాష్ట్ర ప్రభుత్వం..?
హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలతో ‘మహా వికాస్ అగాఢీ’ కూటమి మరోసారి ఇరుకున పడినట్లు తెలుస్తోంది.
‘మహా వికాస్ అగాఢీ’లో ముసలం నేపథ్యంలో..
ముంబయి: మహారాష్ట్ర పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టు అనంతరం అక్కడి రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ముఖ్యంగా హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలతో ‘మహా వికాస్ అగాఢీ’ కూటమి మరోసారి ఇరుకున పడినట్లు తెలుస్తోంది. తాజా ఘటనలు ప్రభుత్వానికి కళంకం తెచ్చాయని అంగీకరిస్తోన్న నేతలు, కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఎన్సీపీ అధినేత పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబయి పోలీస్ మాజీ చీఫ్ పరమ్బీర్ చేసిన ఆరోపణలు, సచిన్ వాజే కేసు వల్ల ‘మహా వికాస్ అగాఢీ’ ప్రభుత్వ ప్రతిష్టకు కళంకం తెచ్చాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంగీకరించారు. ‘ప్రతి నెల రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ హోంమంత్రిపై ఓ పోలీసు ఉన్నతాధికారే ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి ఆయన రాసిన లేఖలో సంచలన విషయాలు ఉన్నాయి. ప్రభుత్వంపై, మంత్రులపై ఇలాంటి ఆరోపణలు రావడం దారుణం, దురదృష్టకరం’ అని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. మంచి పేరున్న ఓ అధికారి ఇటువంటి లేఖ రాయడంపై చర్చించాల్సిన విషయమేనని, ఈ సందర్భంగా మిత్రపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా పరిణామాలపై విలేకరులతో మాట్లాడిన ఆయన, మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంపై పడిన మరకలను ఎలా తొలగించుకోవాలో మిత్రపక్షాలు చర్చించుకోవాలన్నారు.
సవాళ్ల నడుమ మహా వికాస్..!
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఎన్సీపీ నేత శరద్ పవార్ సారథ్యంలో ‘మహా వికాస్ అగాఢీ’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్ముఖ్ హోంమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఆదినుంచి ఏదో ఒక అంశంలో కూటమి పలు విమర్శలు, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. మొన్నటివరకు ఓ యువతి ఆత్మహత్య కేసులో సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శివసేన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఎన్సీపీకి చెందిన నేత అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలు కూటమికి మరోసారి తలనొప్పిగా మారాయి. హోంమంత్రిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
శరద్ పవార్ కీలక నిర్ణయం..?
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సిద్ధమైన ఎన్సీపీ అధినేత శరద్పవార్, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీకి చెందిన మంత్రులను దిల్లీకి రావాలని ఆదేశించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి జయంత్ పాటిల్లు శరద్ పవార్ను కలువనున్నారు. వీరితో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా శరద్ పవార్ను కలిసి మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే శరద్ పవార్తో జరిగే భేటీ అనంతరం కీలక నిర్ణయం వెలుబడే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!