Suneetha Narreddy: అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పిల్లాడా..?: సునీత
రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్ వివేకాను హత్య చేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కమలాపురం: రాజకీయంగా అడ్డొస్తున్నారని వైఎస్ వివేకాను హత్య చేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ‘‘మంచి మనిషి, సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా చేయొచ్చు. కానీ.. నేను పద్ధతి ప్రకారమే వెళ్తున్నాను. ఇది నా వ్యక్తిగత సమస్య కానేకాదు. అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. వివేకా అంశంపై మాట్లాడారు. ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అమాయకంగా అవినాష్ రెడ్డి చూస్తున్నారట. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఆయన అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా? బాధ్యత లేదా..? ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోనివాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? మీకోసం పనిచేసే షర్మిలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ప్రజలను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.