Tammineni veerabhadram: తమ్మినేని ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేసిన ఏఐజీ ఆస్పత్రి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Published : 16 Jan 2024 20:39 IST

హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం బులెటిన్‌ విడుదల చేసింది. ‘‘తమ్మినేని వెంటిలేటర్‌ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి ఏఐజీకి వచ్చారు. ఆయన గుండె, కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఊపిరితిత్తుల్లో నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని