Telangana News: పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయం : తమ్మినేని వీరభద్రం
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతోపాటు సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పని చేస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం గ్రామీణం: రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడం ఖాయమని, అందుకు అనుకూలంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం ముత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రంలోకి భాజపాను రాకుండా నిలువరించేందుకు కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని, అది మునుగోడు ఉప ఎన్నికల రూపంలో రుజువైందన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతోపాటు సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పని చేస్తాయన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో తెరాస, సీపీఐ పార్టీలతో ఏమైనా చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే రాబోయే ఎన్నికల నాటికి వాటన్నింటిని సరిచేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు బండి రమేష్, మండల కార్యదర్శి నండ్రప్రసాద్, స్థానిక నాయకులు తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.