Kanna: ఏపీని కేసీఆర్‌కు అమ్మేద్దామని జగన్‌ చూస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్‌ను కేసీఆర్‌కు అమ్మేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎన్జీరంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఆయన విగ్రహం వద్ద తెదేపా నేతలు నివాళులర్పించారు.

Updated : 07 Nov 2023 13:53 IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను కేసీఆర్‌కు అమ్మేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎన్జీరంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో ఆయన విగ్రహం వద్ద తెదేపా నేతలు నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. 

‘‘2019 ఎన్నికల్లో జగన్‌ ప్రజల్ని మోసం చేసి గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనించారనే.. ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారు. ప్రజలు తమ ఓటును కాపాడుకోవడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలి. సాగర్‌ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తున్నా జగన్‌ నోరు మెదపడం లేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో మన ఆస్తులు పోగొట్టారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారు’’అని కన్నా విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు