Kanna: ఏపీని కేసీఆర్కు అమ్మేద్దామని జగన్ చూస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ను కేసీఆర్కు అమ్మేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎన్జీరంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్లో ఆయన విగ్రహం వద్ద తెదేపా నేతలు నివాళులర్పించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ను కేసీఆర్కు అమ్మేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఎన్జీరంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్లో ఆయన విగ్రహం వద్ద తెదేపా నేతలు నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘2019 ఎన్నికల్లో జగన్ ప్రజల్ని మోసం చేసి గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనించారనే.. ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారు. ప్రజలు తమ ఓటును కాపాడుకోవడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడాలి. సాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తున్నా జగన్ నోరు మెదపడం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో మన ఆస్తులు పోగొట్టారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్కు అమ్మేద్దామని చూస్తున్నారు’’అని కన్నా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్