Kanna: చంద్రబాబుకు పేరొస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్‌ చేయట్లేదు: కన్నా

జులై 20వ తేదీ వచ్చినా కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టలేదని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

Updated : 20 Jul 2023 15:05 IST

గుంటూరు: జులై 20వతేదీ వచ్చినా కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టలేదని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చందాలు వేసుకొని కాల్వలకు మరమ్మతులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ధవళేశ్వరం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వదులుతున్నారని.. పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వట్లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు పేరొస్తుందనే పట్టిసీమ మోటార్లు ఆన్‌ చేయట్లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును వైకాపా పూర్తి చేసే పరిస్థితి లేదన్నారు. పట్టిసీమ నుంచి వెంటనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని కన్నా డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడి చేసి వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని