Kanna: చంద్రబాబుకు పేరొస్తుందని పట్టిసీమ మోటార్లు ఆన్ చేయట్లేదు: కన్నా
జులై 20వ తేదీ వచ్చినా కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టలేదని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
గుంటూరు: జులై 20వతేదీ వచ్చినా కాల్వలకు మరమ్మతు పనులు చేపట్టలేదని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చందాలు వేసుకొని కాల్వలకు మరమ్మతులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ధవళేశ్వరం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వదులుతున్నారని.. పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీకి ఇవ్వట్లేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు పేరొస్తుందనే పట్టిసీమ మోటార్లు ఆన్ చేయట్లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును వైకాపా పూర్తి చేసే పరిస్థితి లేదన్నారు. పట్టిసీమ నుంచి వెంటనే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని కన్నా డిమాండ్ చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడి చేసి వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.