Andhra News: వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల
పార్లమెంట్కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
దిల్లీ: పార్లమెంట్కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని చెప్పారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని అన్నారు. దిల్లీలో ఎంపీ రామ్మోహన్నాయుడితో కలసి కనకమేడల మీడియాతో మాట్లాడారు.
‘‘రాజ్యాంగాన్ని విశ్లేషించేందుకు కేంద్రం సుప్రీం కాదు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ప్రభుత్వాలు అంటే వ్యక్తులు కాదు సంస్థలు అని గుర్తించాలి. ప్రభుత్వాలు కొనసాగుతాయి.. వ్యక్తులు మారతారు. పార్టీలు మారితే రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదు. రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. జడ్జిలను బెదిరిస్తున్నారు, న్యాయవ్యవస్థలను దూషిస్తున్నారు. దీన్ని కోర్టుల పట్ల బెదిరింపు ధోరణితో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. చట్టాలను మార్చే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది. కోర్టు తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’’ అని కనకమేడల అన్నారు.
మద్యం మరణాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం రాజధాని అంశాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని రామ్మోహన్నాయుడు అన్నారు. మూడు రాజధానులని మూడేళ్లలో ఒక్కచోటైనా అభివృద్ధి చేశారా అని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM