TDP: ‘ఏపీ హేట్స్ జగన్’.. పుస్తకాన్ని విడుదల చేసిన తెదేపా
నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని తెదేపా హెచ్చరించింది.
అమరావతి: నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని తెదేపా హెచ్చరించింది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు.
52 నెలల వైకాపా పాలనలో ఒక్కో కుటుంబంపై జగన్ లక్షలాది రూపాయల భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారమే రూ.64 వేల కోట్లని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని..30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్ లక్ష కోట్ల కమీషన్ కొట్టేసిందని దుయ్యబట్టారు. తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి.. చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చానని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. జగన్ నెరవేర్చని హామీల లిస్టు చాన్తాడంత ఉందని.. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.