Nara Lokesh: జగన్ అలా అంటే జాలి పడొద్దు: లోకేశ్
ఏపీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
పాతపట్నం: ఏపీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనేలా ఆయన పాలన సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్ మాట్లాడారు. ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్పారని.. అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారన్నారు. ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తెదేపా-జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రెండు నెలలు ఓపిక పట్టాలని.. నిరుద్యోగులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ మధ్య జగన్.. మీ బిడ్డ.. మీ బిడ్డ.. అని అంటున్నారని.. ప్రజలు జాలి చూపించొద్దని సూచించారు. పొరపాటున జగన్ ఎన్నికల్లో గెలిస్తే మీ బిడ్డనే కదా.. మీ భూమి తీసుకుంటానంటారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
‘‘రూ.కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది వైకాపాకు అంతిమయాత్రగా మారింది. డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమన్నా.. ఎవరూ పోవడం లేదు. తెదేపా హయాంలో జరిగిన నిర్మాణాలకు జగన్ రంగులు వేసుకుంటున్నారు. ఆయన్ను చూస్తే కోడికత్తి.. చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుంది. జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ. తెదేపా అధినేతను అరెస్టు చేస్తే పార్టీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారు. కేసులకు భయపడేది లేదని జగన్ గుర్తుంచుకోవాలి. బాంబులకే భయపడని కుటుంబం మాది.. పనికిమాలిన కేసులకు భయపడతామా?అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ చేస్తున్నా.. ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుంది.
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ బోర్డులు పెడుతున్నారు. మీ తల్లి, సోదరే మిమ్మల్ని నమ్మడం లేదు.. మేమెలా నమ్ముతాం? ప్రాణహాని ఉందని షర్మిల, సునీత చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు కల్పించగలరా?జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిన షర్మిలను బెదిరిస్తున్నారు. జగన్ను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారు. ఆయనకు 2 బటన్లు ఉంటాయి. బల్లపై ఒక బ్లూ బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బ్లూ బటన్ నొక్కితే ఖాతాలో రూ.10 పడతాయి.. ఎర్ర బటన్ నొక్కగానే రూ.100 పోతాయి. 9 సార్లు విద్యుత్, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. భవిష్యత్తులో పీల్చే గాలికీ జగన్ పన్ను వసూలు చేస్తారేమో’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!