AP News: అధికారం ఉందని బరితెగిస్తే బడితెపూజ ఖాయం: అచ్చెన్నాయుడు
వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు..
అమరావతి: వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు.. దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి శూన్యమని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే.. వైకాపా కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో తెదేపాకు చెందిన మహిళా సర్పంచ్ మల్లేశ్వరి ఇంటిపై వైకాపా రౌడీ మూకలు దాడి చేశారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళా హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారం ఉందని బరితెగించి వ్యవహరిస్తున్న వారికి రానున్న రోజుల్లో మహిళల చేతిలోనే బడితెపూజ ఖాయమని హెచ్చరించారు. వైకాపాకు కౌంట్డౌన్ మొదలైందని.. ఇక వారి అరాచకాలు సాగవన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనన్నారు. మల్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని, కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM