Ts News: తెరాస,భాజపా పోటాపోటీ నినాదాలు.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రగడ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ తొలి సమావేశం రసాబాసగా ముగిసింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో భాజపా కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ తొలి సమావేశం రసాబాసగా ముగిసింది. తెరాస కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో భాజపా కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాజపా సభ్యులు మాట్లాడేందుకు మేయర్ అవకాశం ఇవ్వడంపై తెరాస కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా స్పందించిన భాజపా సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, భారత్ మాతాకీ జై అంటూ ఇరు పార్టీల కార్పొరేటర్లు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఆందోళన మధ్యలోనే కౌన్సిల్ సమావేశం ముగిసినట్టు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు.
కరోనా సమయంలో స్మశాన వాటికల్లో ఎంతమందిని ఖననం చేశారు?
కౌన్సిల్ లో మొత్తం 23 ప్రశ్నలు అడిగేందుకు అవకాశమిచ్చారు. ఎస్ఎన్డీపీపై సుదీర్ఘ చర్చ జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో స్మశానవాటికల్లో ఎంతమందిని ఖననం చేశారు? ఎంతమందిని పూడ్చిపెట్టారు? ఎంతమందికి అంత్యక్రియలు నిర్వహించారు? వివరాలు చెప్పాలని అడిగారు. రోశయ్యకు స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్మశానవాటికలను కొన్నింటిని స్థానిక సంస్థలకు అప్పగించామని, అందువల్ల కచ్చితమైన మరణాల వివరాలు చెప్పలేమని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని పలు అక్రమ కట్టడాలపై కార్పొరేటర్లు సభలో చర్చించారు. జీహెచ్ఎంసీకి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో వివరాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఎస్ఎన్డీపీకి సంబంధించిన పనుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.633 కోట్లు, మున్సిపాలిటీ పరిధిలో రూ.885 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని, పనులు పురోగతిలో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్