Ts News: పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా అనేక చర్యలు: కేటీఆర్
పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని.. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు....
హైదరాబాద్: పర్యావరణ హితమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని.. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. గత ఏడాది అక్టోబరులోనే ఎలక్ట్రానిక్ వాహనాల విధానం తీసుకొచ్చామని.. తయారీదారులతోపాటు వినియోగదారులనూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. పరిశోధన, అభివృద్ధి, నవీకరణలను ప్రోత్సహించేందుకు వీలుగా తయారీదారులకు ఎస్జీఎస్టీ తిరిగి ఇవ్వడం, విద్యుత్తు, వడ్డీ, రవాణా తదితర అంశాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు రహదారి పన్నుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు.
హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనం 28 శాతానికి పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ స్టోరేజీ పాయింట్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లా చందనపల్లి, మహబూబ్నగర్ జిల్లా దివిటి పల్లిలో రెండు చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జహీరాబాద్లో ఉన్న క్లస్టర్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఓ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి సంబంధించి రూ.5,600 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. తద్వారా 8,300 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, ఇంతకంటే రెట్టింపు పరోక్షంగా ఉపాధి లభిస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?